IPL2023 : ఎయిర్పోర్ట్లో దొంగలు పడ్డారు.. ఢిల్లీ ప్లేయర్స్ బ్యాగులు ఎత్తుకెళ్లారు

IPL2023 : ఎయిర్పోర్ట్లో దొంగలు పడ్డారు.. ఢిల్లీ ప్లేయర్స్ బ్యాగులు ఎత్తుకెళ్లారు

ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్ల కష్టాలు రోజు రోజుకు ఎక్కువైపోతున్నాయి. ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న ఆటగాళ్లు ఒకవైపు.. గెలుపు చివరి వరకు వచ్చిన మ్యాచ్ లు ఓడిపోవడం ఇంకో ఎత్తు. ఈ సీజన్ లో ఆడిన ఐదు మ్యాచుల్లో ఢిల్లీ జట్టు ఓడిపోయింది. ఈ పరిణామాలన్నింటికీ కారణం కోచ్, స్టాఫ్ అంటూ.. ఢిల్లీ మేనేజ్మెంట్ సింబ్భందిని తొలగించే పనిలో పడింది. తాజాగా మరో ఘటన ఢిల్లీ ప్లేయర్లని కలవర పెట్టింది. బెంగళూరుతో జరిగిన మ్యాచ్ అనంతరం ఢిల్లీకి బయలు దేరిన ప్లేయర్ల కిట్ బ్యాగ్స్ ను ఎయిర్ పోర్టులో దొంగిలించారు. 

కొంతమంది ప్లేయర్ల బ్యాట్లు పోగా.. మరికొంతమంది ప్లేయర్ల ప్యాడ్లు, గ్లౌజ్, బూట్లు మరి కొన్ని వస్తువులు మిస్ అయ్యాయి. ఈ ఘటనపై ఢిల్లీ ఫ్రాంచేజీ ఎయిర్ పోర్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఢిల్లీ కెప్టెన్ వార్నర్ వి మూడు బ్యాట్లు, ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ వి రెండు బ్యాట్లు, ఫిల్ స్టాల్ వి మూడు, యశ్ ధుల్ వి ఐదు బ్యాట్లు దొంగిలించబడ్డాయి. ఆటగాళ్లందరివి కలిపి మొత్తం 16 బ్యాట్లు పోయాయి. ఒక్క బ్యాటు ధర రూ. లక్ష ఉంటుందని అధికారులు చెప్తున్నారు. 

ఆటగాళ్ల కిట్ లు ఎక్కడ మిస్ అయ్యాయని ఏయిర్ పోర్ట్ లాజిస్టిక్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.  ఢిల్లీ మంగళవారం ప్రాక్టీస్ సెషన్‌ను నిర్వహించగా.. ఈలోగా కొత్త బ్యాట్‌ల కోసం ఆటగాళ్లు తమ ఏజెంట్లను సంప్రదించారు.